టెక్కీ నీలిమ మృతి ఇంకా పజిలే, అనుమానాస్పదమే

శరీర పరీక్షలో ఏమైనా మరిచిపోయామో మరోసారి చూడడానికి పోస్టుమార్టం సిడి తమకు కావాలని, నేరం జరిగిన స్థలంలోని చిత్రాలు కావాలని అడిగినట్లు నీలిమ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి. విక్రమాదిత్య చెప్పినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి. నేరం జరిగిన స్థలంలోని చిత్రాలను, నీలిమ గాయాలను బట్టి వైద్యులు పోస్టుమార్టం రిపోర్టును తయారు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
నీలిమ మృతిపై ఓ నిర్ధారణకు రావడానికి వారం రోజులు పడుతుందని డిసిపి యోగానంద్ అంటున్నారు. పోస్టుమార్టం రిపోర్డుపై ఓ నిర్ణయానికి రావడం సరైంది కాదని, నేరం జరిగిన స్థలంలోనే క్లూస్ దొరుకుతాయని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. ఆత్మహత్య అయి ఉంటే భవనానికి దూరంగా మృతదేహం పడి ఉండేదని అంటున్నారు. అయితే, పడుతున్నప్పుడు గోడకు తాకడం వల్ల మృతదేహం భవనానికి సమీపంలో పడి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
నీలిమ శరీరానికి పైభాగంలో ఎక్కువ గాయాలు కనిపిస్తున్నాయని, పైనుంచి పడి ఉంటే కాళ్లకు, శరీరం కింది భాగాలకు ఎక్కువ గాయాలు కావాల్సి ఉండాలని, అయితే లోపల ఫ్రాక్చర్స్ ఉన్నాయేమో తెలియదని అంటున్నారు. ఆమె శరీరానికి తగిలిన గాయాల గురించి ఎవరూ పెద్దగా మాట్లాడడం లేదు. అయితే, ఇన్ఫోసిస్ కార్యాలయానికి కేవలం ఆత్మహత్య చేసుకోవడానికే నీలిమ వెళ్లిందా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications