అఫిడవిట్లోలేని ఫెరా ఉల్లంఘన: పార్థసారథికి కొత్తచిక్కు

దీంతో మంత్రిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ స్పందిస్తూ.. అఫిడవిట్లో పూర్తి వివరాలు లేకపోతే సెక్షన్ 125ఏ ప్రకారం కేసు నమోదు చేస్తామని చెప్పారు. పార్థసారధి అఫిడవిట్ వ్యవహారంలో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని చెప్పారు. మంత్రిని తొలగించాలంటూ బ్యానర్లను కట్టడం సరికాదన్నారు. మంత్రి తప్పుచేస్తే చర్యలు తప్పవని భన్వర్ లాల్ అన్నారు. పార్థసారథి తన అఫిడవిట్లో ఫెరా కేసును వెల్లడించనందున అతనిపై పై సెక్షన్ కింద కేసు నమోదయ్యే అవకాశముంది.
ఇటీవల ఆర్థిక నేరాల కోర్టు మంత్రికి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పార్థసారథికి శిక్ష విధించిన కోర్టు అతనికి బెయిల్ ఇస్తూ అప్పీల్ చేసుకోవడానికి నెల రోజుల గడువు కూడా ఇచ్చింది. గతంలో పార్థసారధి కెపిఆర్ టెలీ ప్రొడెక్ట్స్ ఎండిగా ఉన్నప్పుడు ఫెరాను ఉల్లంఘించారంటూ 2002లో ఈడి కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు మంత్రి ఫెరాను ఉల్లాంఘించినట్లు నిర్థారించింది. రెండు నెలల జైలు శిక్ష, ఐదులక్షల జరిమానాను కోర్టు విధించగా అప్పీలు చేసుకున్న పార్థసారధి బెయిల్ తీసుకున్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications