హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షిర్డీ సాయిబాబా నిధుల గల్లంతుపై ఘర్షణ, ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Diksukhnagar Shirdi Saibaba
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో గల షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. నిధుల గల్లంతు వ్యవహారంపై ఘర్షణ చెలరేగి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఆలయం దక్షిణ షిర్డీగా పేరు పొందింది. సాయి సంస్థాన్ నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో విచారణ జరిపేందుకు సోమవారం దేవాదాయ శాఖ అధికారులు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ ఛైర్మన్ జయస్వామి, ట్రస్టు బోర్డు సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసి పరస్పర దాడులకు దిగారు. దీంతో విచారణ ఆగిపోయింది. పోలీసులు భారీగా మోహరించారు. శ్రీషిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌లో భారీగా అక్రమాలు జరిగాయంటూ దేవాదాయశాఖకు ఫిర్యాదులందాయి. ఫిర్యాదులపై సోమవారం విచారణ జరపాలని నిర్ణయించుకుంది.

సాయిసంస్థాన్ ట్రస్ట్ నిధుల్లో రూ.10కోట్లు స్వాహా అయ్యాయని సంస్థాన్ మాజీ చైర్మన్ ఎస్.జయస్వామి దేవాదాయ ధర్మాధాయ శాఖ కమిషనర్‌కు జూన్‌లో ఫిర్యాదు చేశారు. సంస్థాన్ పేరుతో జరుగుతున్న నిధుల స్వాహాతో పాటు అనేక అక్రమాలపై విచారణ జరపాలని ఆయన కోరారు. ఈమేరకు ఫిర్యాదు స్వీకరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ బలరామయ్య దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీషిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌లో జరుగుతున్న అక్రమాలు, నిధుల స్వాహపై విచారణకు ఆదేశించారు.

అసిస్టెంట్ కమిషనర్ ఎ.వి.రమణమూర్తిని విచారణ అధికారిగా నియమించారు. రమణమూర్తితో కూడిన బందం సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దిల్‌షుక్ నగర్‌లో షిర్డీ సాయిబాబా ఆలయం విశేషంగా భక్తుల ఆదరణ పొందింది. పెద్ద యెత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

English summary
Tension prevailed at Dilsukhnagar Shirdi Saibaba temple, as clash took place between trust former chaireman and members during Endowment offisers probe on funds missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X