షిర్డీ సాయిబాబా నిధుల గల్లంతుపై ఘర్షణ, ఉద్రిక్తత

ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసి పరస్పర దాడులకు దిగారు. దీంతో విచారణ ఆగిపోయింది. పోలీసులు భారీగా మోహరించారు. శ్రీషిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ దేవాదాయశాఖకు ఫిర్యాదులందాయి. ఫిర్యాదులపై సోమవారం విచారణ జరపాలని నిర్ణయించుకుంది.
సాయిసంస్థాన్ ట్రస్ట్ నిధుల్లో రూ.10కోట్లు స్వాహా అయ్యాయని సంస్థాన్ మాజీ చైర్మన్ ఎస్.జయస్వామి దేవాదాయ ధర్మాధాయ శాఖ కమిషనర్కు జూన్లో ఫిర్యాదు చేశారు. సంస్థాన్ పేరుతో జరుగుతున్న నిధుల స్వాహాతో పాటు అనేక అక్రమాలపై విచారణ జరపాలని ఆయన కోరారు. ఈమేరకు ఫిర్యాదు స్వీకరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ బలరామయ్య దిల్సుఖ్నగర్లోని శ్రీషిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో జరుగుతున్న అక్రమాలు, నిధుల స్వాహపై విచారణకు ఆదేశించారు.
అసిస్టెంట్ కమిషనర్ ఎ.వి.రమణమూర్తిని విచారణ అధికారిగా నియమించారు. రమణమూర్తితో కూడిన బందం సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దిల్షుక్ నగర్లో షిర్డీ సాయిబాబా ఆలయం విశేషంగా భక్తుల ఆదరణ పొందింది. పెద్ద యెత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
-
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications