టెక్సాస్ వర్సిటీ వద్ద కాల్పులు: ముగ్గురు మృతి
మూడో మృతుడు పౌరుడు బైస్టాండర్ అంటూ నగరం కాలేజ్ స్టేషన్ అధికారి ఒకరు ట్విట్టర్లో పోస్టు చేశాడు. రెసిడెన్షియల్ నైబర్హుడ్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారని అసిస్టెంట్ పోలీసు చీప్ స్కాట్ మెక్కుల్లం ధ్రువీకరించారు. సంఘటన గురించి వివరిస్తూ సహనం వహించాలని ఆయన ప్రజలను కోరారు.
కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కాగా, మరొకరు మహిళా పౌరురాలు అని మెక్కుల్లం చెప్పారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. టెక్సాస్ ఎ అండ్ ఎం విశ్వవిద్యాలయానికి కొద్ది బ్లాక్ల దూరంలోనే మధ్యాహ్నం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
తమను కస్టడీలోకి తీసుకుంటారనే ఉద్దేశంతో సాయుధుడు తనను కాల్చుకున్నాడని చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందు పోలీసులు పౌరుల నుంచి 911 కాల్స్ స్వీకరించడం ప్రారంభించారు.