శ్రీలక్ష్మికి ఉస్మానియాలో చికిత్స, ములాకత్లో జాగ్రత్తలు
కాగా జైలు ములాఖత్ విషయంలో జాగ్రత్త వహించకపోతే తగిన చర్యలు తప్పవని చంచల్గూడ జైలు సిబ్బందిని సూపరింటెండెంట్ కేశవనాయుడు హెచ్చరించారు. శనివారం జైలులో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇటీవల వివిఐపిల ములాకత్లో విషయంలో జైలు అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
గాలి బెయిల్ డీల్ కేసులో దర్యాఫ్తు
మరోవైపు గాలి జనార్దన్రెడ్డి బెయిల్ డీల్ కేసులో దర్యాప్తు దాదాపుగా పూర్తి కావస్తోంది. జడ్జిలతో పాటు రాజకీయ నాయకులు కూడా జైలు పాలైన ఈ కేసు త్వరలోనే విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 11 మంది అరెస్టు కాగా వ్యాపారి రావి సూర్యప్రకాష్కు షరతులతో కూడిన బెయిల్ లభించింది.
ఇంతవరకు 55 మంది సాక్షులను విచారించిన దర్యాప్తు అధికారులు కొద్ది రోజుల క్రితమే ఏసీబీ కోర్టులో తొలి చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జికి భారీగా ముడుపు ల ఆశజూపి ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు నుంచి అక్రమం గా బెయిల్ పొందిన గాలి ఆస్తులపైనా అధికారులు దృష్టి సారించారు.
అటు దివంగత వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన గాలి.. జగన్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై ఆరా తీసున్నారు. కాగా, బెయిల్ స్కాంలో నిందితులైన మాజీ జడ్జి పట్టాభి రామారావు, ఆయన కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ జడ్జి చలపతి రావు బెయిల్ పిటిషన్లపై తీర్పు సోమవారానికి వాయిదా పడింది.