వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై సిబిఐ విచారణ: కాంగ్రెస్‌ను వీడాకే.. జైట్లీ వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Arun Jaitley
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడిన తర్వాతనే సిబిఐ దర్యాఫ్తు ప్రారంభమయిందని భారతీయ జనతా పార్టీ జాతీయ నేత అరుణ్ జైట్లీ శనివారం అన్నారు. ఆయన ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసులో ఉన్నప్పుడు ఎలాంటి విచారణలు, దర్యాఫ్తులు లేవన్నారు. ఆ పార్టీ నుండి బయటకొచ్చి సొంత కుంపటి పెట్టుకున్న తర్వాతనే సెంట్రల్ బ్యరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ), ఈడి విచారణలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మంత్రి ధర్మాన ప్రసాద రావుపై సిబిఐ ఛార్జీషీటు, రాష్ట్రంలో అవినీతి తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ పై విధంగా స్పందించారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో అవినీతిపై విచారణ చాలా ఆలస్యంగా జరుగుతోందని, అవినీతి జరిగినప్పుడే విచారణ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామా వ్యవహారంపై అరుణ్ జైట్లీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలు వేడి పుట్టించిన విషయం తెలిసిందే.

English summary

 BJP senior leader Arun Jaitly alleged that CBI probe started on YSR Congress party chief YS Jaganmohan Reddy properties after formation of party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X