బాలిక ఆత్మహత్య కేసు ట్విస్టు: లైంగిక దాడి కోణం

పదిహేనేళ్ల పల్లవి హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు వచ్చే వరకు ఆగకుండా హాస్టల్ అధికారులు ఆమెను గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బతికించడానికే అలా చేశామని హాస్టల్ అధికారులు చెప్పారు. అయితే, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చేశారు.
సమాచారం అందిన వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. తమ బాలిక సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన విషయంపై తమకు పాఠశాల అధికారులు సరిగా చెప్పలేదని వారు ఆరోపించారు. దాంతో స్థానికులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. దీంతో ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు హామీ ఇచ్చారు. బాలిక విస్రాను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించాలని పోలీసులు వైద్యులకు సూచించారు.
పామర్రు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్పై బాలిక తల్లిదండ్రులు నాగమణి, దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే పాఠశాలలో పల్లవి చదువుతోంది. మరణించిన రోజు పల్లవికి కనకరాజు అనే వ్యక్తి నుంచి పోన్ వచ్చినట్లు దర్యాప్తులో తేలింది.
కనకరాజు కూడా పల్లవి గ్రామానికి చెందినవాడే. ముసునూరు మండలం పెదపాటివారిపాలెం గ్రామానికి చెందిన కనకరాజుపై తొలుత పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు అతన్ని విచారించారు. అతను రెండు రోజుల తర్వాత గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పల్లవి మృతికి సంబంధించి ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ శుక్రవారం నివేదికను సమర్పించింది. మరణానికి కొద్ది గంటల ముందు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ఆ పరీక్షల్లో తేలింది.












Click it and Unblock the Notifications