జయ వేట: అళగిరి కుమారుడిపై లుకవుట్ నోటీస్

అక్రమ గ్రానైట్ మైనింగ్ కేసులో దురై దయానిధిపై లుకవుట్ నోటీసులు జారీ అయ్యాయి. విచారణ నిమిత్తం దురై దయానిధికి లుకవుట్ నోటీసులు జారీ చేసినట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ మైనింగ్ వ్యవహారాలపై ఆయనను విచారిస్తామని చెబుతున్నారు.
దురై దయానిధి దేశం విడిచి వెళ్లకుండా చూడాలని పోలీసులు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. గ్రానైట్ కేసులో 17 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిలో ఒలింపిస్పై ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ల్లో చేర్చిన పేర్లలో దురై దయానిధి పేరు ఉంది. ఎఫ్ఐఆర్లో మొత్తం 60 మంది పేర్లను చేర్చారు.
గ్రానైట్ పరిశ్రమలో ఉల్లంఘనలు జరగడం వల్ల ఖజానాకు 16 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని మధురై మాజీ కలెక్టర్ ఆరోపణలు చేశారు. జిల్లాలోని 175 క్వారీలపై భారీ దాడులు జరిగాయి. ఇదిలావుంటే, అళగిరి కుమారుడు దురై దయానిధి ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇది ఈ నెల 4వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications