హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై ఢిల్లీకి: జానా రెడ్డి ఇంట్లో మంత్రులు భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఇంట్లో ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు మంత్రులు సోమవారం సమావేశమయ్యారు. చర్చల్లో జానాతో పాటు మంత్రులు గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు పాల్గొన్నారు. వారంతా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాయనున్న లేఖలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశంపై అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు వీలుగా ఢిల్లీకి వెళ్లాలని వారు నిర్ణయించారు.

తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సోనియా గాంధీని కోరుతూ సాధ్యమైనంత తొందరగా లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. ఈ లేఖపై మిగిలిన మంత్రుల సంతకాలను సేకరించాలని.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సోనియా గాంధీ ఢిల్లీకి వచ్చిన వెంటనే ఆమెను కలవాలని నిర్ణయించారు.

తక్షణమే తెలంగాణ ప్రకటించాల్సిన ఆవశ్యకతను కేంద్రానికి తెలియజేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. తాను తయారు చేసిన నమూనా లేఖను జానా రెడ్డి మంత్రులకు చదివి వినిపించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారంపై మంత్రి బస్వరాజు సారయ్య స్పందిస్తూ తమకు పదవులు వద్దని, ప్రత్యేక రాష్ట్రమే కావాలని స్పష్టం చేశారు.

English summary
Telangana ministers Baswaraj Saraiah, Geetha Reddy and Ponnala Laxmaiah were met in Jana Reddy's residence on Monday and talk about who to put pressure on High Comman about Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X