హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య మాజీ భర్తను చంపిన వ్యక్తి, వచ్చేసినందుకే..

By Pratap
|
Google Oneindia TeluguNews

Man killed by wife’s ex-husband
హైదరాబాద్: తనను వదిలేసి తన భార్య వివాహం చేసుకున్న యువకుడిని ఓ వ్యక్తి రోకలిబండతో మోది హత్య చేశాడు. కడప జిల్లా ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పి.రమేష్‌కు అదే ప్రాంతానికి చెందిన సుశీలతో 2004లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 2011లో వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది.

ఈ క్రమంలో నెల్లూరు జిల్లా బొత్తునపల్లి గ్రామానికి చెందిన ఆనంపల్లి నాగార్జున (23)తో సుశీలకు పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. 2011, జనవరిలో ప్రొద్దుటూరులోని శివాలయంలో వీరు దండలు మార్చుకున్నారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్ ఫేజ్-2లో ఓ గదిని అద్దెకు తీసుకుని పిల్లలతో కలిసి ఉంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న రమేష్ తొమ్మిది రోజుల క్రితం నగరానికి వచ్చాడు. పిల్లలను చూపించమని భార్యను కోరాడు. అందుకు అంగీకరించిన సుశీల ఇంట్లో స్థానం కల్పించింది. తను ఉండగానే నాగార్జునతో సుశీల చనువుగా ఉండటంతో జీర్ణించుకోలేకపోయిన రమేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నాగార్జునను హత్య చేయాలని పథకం వేశాడు.

ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిద్రపోతున్న నాగార్జున తలపై రోకలిబండతో మోది హతమార్చాడు. అనంతరం పారిపోయాడు. సుశీల సమాచారంతో సీఐ జానయ్య, ఎస్ఐలు కాశీంపీరా, నేతాజీ సంఘటన స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

English summary

 A 23-year-old man was murdered by his wife's former husband in Petbasheerabad on Monday night. The victim was identified as Nagarjuna of Potunurpalli in Nellore district. In January, Nagarjuna married Susheela, 23, who had left her first husband Ramesh, two years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X