వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు ఎంపి బొత్స ఝాన్సీ ఇంట్లో ఎసి చోరీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Jhansi
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్లమెంటు సభ్యురాలు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ నివాసంలో ఎసి దొంగతనం జరిగింది. దేశ రాజధానిలోని వివిఐపి ప్రాంతంలో ఉన్న ఇంట్లోంచి ఎసిని దొంగలించుకుపోయారు. బుధవారం పోలీసులు ఈ విషయం చెప్పారు.

బొత్స ఝాన్సీ నివాసంలో మంగళవారం ఈ చోరీ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. దొంగతనం కేసు నమోదైంది. బొత్స ఝాన్సీ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోకసభ నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

స్ప్లిట్ ఎయిర్ కండీషనర్ అవుట్‌డోర్ యూనిట్ దొంగతనం జరిగిందని బొత్స ఝాన్సీ పర్సనల్ అసిస్టెంట్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భవనానికి 24 గంటల భద్రత కల్పించాలని బొత్స ఝాన్సీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో కోరారు.

బొత్స ఝాన్సీ భర్త బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఆయన తరుచూ ఢిల్లీకి వస్తుంటారు కూడా.

English summary
Thieves have decamped with an air- conditioner from the house of a Congress MP from Andhra Pradesh located in VVIP area of the capital, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X