హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నదమ్ముల హత్య, బెజవాడలో ఢిల్లీ యువకుడి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు/ విజయవాడ/ హైదరాబాద్: గుంటూరు జిల్లాలోని శ్రీనివాసరావుపేట అరవై అడుగుల రోడ్డులో దారుణం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు అన్నదమ్ములను కొందరు దుండగులు దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

మృతులు జూపూడి శ్రీనివాసరావు, రవికుమార్‌లుగా గుర్తించారు. వారిని శ్రీనివాసరావు భార్యే చంపించిందని మృతుల తల్లి ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ భార్య పద్మావతిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని గాంధీనగర్ ఉండవల్లివారివీధిలో ఢిల్లీకి చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వాంటర్‌ట్యాంక్‌పై అతడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ నగరంలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను శనివారం ఉదయం బోయిన్‌పల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 50 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

English summary
Two brothers were killed at Srinivasraopet of Guntur district. The deceased were identified as Jupufi Srinivas Rao and Ravikumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X