కిరణ్ను తీసేస్తారా నన్నుతొలగిస్తారా: డిఎల్, శంకరన్నా..
శంకర రావు కూడా తనదైన శైలిలో కిరణ్ పైన విరుచుకు పడ్డారు. కిరణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంక్ 33 శాతం నుండి 18కి పడిపోయిందని ఆరోపించారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అలా అయితే పార్టీ నష్టపోతుందని హెచ్చరించారు. నామినేటెడ్ పోస్టులో సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వారికి చాలారోజులుగా పార్టీలో అన్యాయం జరుగుతోందన్నారు.
గ్యాస్ పైన సబ్సిడీ భారం భరించలేమని ముఖ్యమంత్రి చెప్పడం అంతా గ్యాస్ మాటలే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ భారాన్ని భరించి తీరాలాన్నారు. సబ్సిడీ ఇచ్చే వారికి 9 నుండి 12 సిలిండర్లు పెంచాలన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించని కారణంగా పార్టీ కేడర్లో ఉత్సాహం తగ్గిపోయిందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభంజనంలోనూ రాష్ట్రంలో 33 శాతం ఉన్నకాంగ్రెసు ఓటు బ్యాంక్ కిరణ్ హయాంలో మాత్రం పడిపోతుందన్నారు.
ఒక ముఖ్యమంత్రి ఉండగా తాను మరో ముఖ్యమంత్రి గురించి మాట్లాడనని పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి వేరుగా ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. కాంగ్రెసు మైనార్టీ ప్రభుత్వాన్ని నడపడంలో దిట్ట అన్నారు. కేంద్రంలో ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. డిఎంకె, బిఎస్పీ, వామపక్షాలు ఎన్నికలకు సిద్ధంగా లేవని, ఎఫ్డిఐలపై కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదన్నారు.