వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై కేంద్రం: నేతలకు మంత్రి శైలజానాథ్ ఫోన్లు
ఈ నెల 22తో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. దీనికి ముందే, అంటే 21న సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా సమావేశమైతే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకవైపు తెలంగాణ ప్రాంత నేతలు తమ వాణిని గట్టిగా వినిపిస్తున్నారని, ఈ సమయంలో తమ గళం వినిపించకపోతే కేంద్ర నిర్ణయం ఏకపక్షమయ్యే అవకాశం ఉండవచ్చునని వారిలో కొందరు ఆందోళన చెందుతున్నారట.
అందుకే ఒకచోట చేరి ఈ అంశంపై లోతుగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని శైలజానాథ్ సదరు నేతలకు చెబుతున్నట్లు సమాచారం. అంతా అంగీకరిస్తే కేంద్ర పెద్దలతో మాట్లాడడానికి వీరంతా ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో ఉండి కాంగ్రెసు పెద్దలతో తెలంగాణపై మంతనాలు జరుపుతున్నారు.
Comments
English summary
Seemandhra leaders are planning to meet about
Telangana issue before 22nd of this month.
Story first published: Thursday, September 20, 2012, 9:19 [IST]