అధికారుల వల్లే: ఉత్తమ్కుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు

లబ్ధిదారుల దగ్గర అవినీతకి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు లబ్ధిదారులకు అందాల్సిన డబ్బులను సకాలంలో చెల్లించాలని, వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులకు సూచించారు. అవినీతికి పాల్పడిన అధికారులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని, డిస్మిస్ చేస్తామని అన్నారు.
హౌసింగ్ కార్పోరేషన్ పరిధిలో 40 ఇసుక రీచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది 10 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రతిపాదన ఉందని చెప్పారు. గతంలో రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించాలని సూచించారు. కాగా గతంలోనూ పలువురు మంత్రులు ఆయా శాఖల అధికారుల తీరుపై మండిపడిన విషయం తెలిసిందే.
కాగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రూ.1 మంజూరు చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేరుగా చెప్పారు. అభివృద్ధి నిధులను రూ.2 కోట్లకు పెంచే ఆలోచన ఉందని చెప్పారు. అయితే ఈ నిధులు రూ.3 కోట్లకు పెంచాలని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సూచించారు.












Click it and Unblock the Notifications