వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

18 ఏళ్లు బహిష్కరించాలి: బొత్సపై సమైక్యాధ్ర జెఏసి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
విశాఖపట్నం/విజయవాడ: తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటన్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కించపరిచేలా బొత్స వ్యాఖ్యానించారని వారు ఆరోపించారు. గురజాడ అప్పారావు విగ్రహం వద్ద వారు బొత్స వైఖరిపై తమ నిరసన వ్యక్తం చేశారు.

పద్దెనిమిదేళ్ల పాటు బొత్స, ఆయన కుటుంబ సభ్యులను బహిష్కరించాలని సమైక్యాంధ్ర రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ కవాతు నేపథ్యంలో సీమాంధ్రవాసులకు గానీ, నేతలకు గానీ, వారి ఆస్తులకు గానీ నష్టం వాటిల్లితే తాము ఇచ్చే రేపటి బందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని మంత్రి శైలజానాథ్ చెప్పారు. సీమాంధ్ర నేతలు హైదరాబాదులో కవాతు నిర్వహిస్తే మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర నేతలు, ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టం హైదరాబాదులో వాటిల్లదని ఆయన భరోసా ఇచ్చారు. గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జైఆంధ్రా కవాతు ప్రారంభమైంది. విజయవాడ బిజెపి కార్యాలయం నుండి జై ఆంధ్రా కవాతును నిర్వహించారు. కాగా జై ఆంధ్రా మార్చ్ నిర్వహిస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Samakiyandhra JAC lashed out at PCC chief and Transport minister Botsa Satyanarayana for his statement against Samaikyandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X