వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలోకి చొచ్చుకొచ్చిన యువకులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Three youths jump into well of Jammu and Kashmir Assembly
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సోమవారం కాసేపు హైడ్రామా చోటు చేసుకుంది. కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని దాటుకొని ముగ్గురు నిరుద్యోగ యువకులు అసెంబ్లీలోకి చొచ్చుకు వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు వెల్‌లోకి చొచ్చుకు పోయారు. బెంచీల పైకి ఎక్కి రచ్చ రచ్చ చేశారు. ఉద్యోగాల పాలసీకి నిరసనగా వారు నల్లజెండాలను ప్రదర్శించారు.

ఉద్యోగాలు కల్పించని ఓమర్ అబ్దుల్లా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే పటిష్టమైన భద్రతా వలయాన్ని చేధించుకొని ముగ్గురు యువకులు అసెంబ్లీ లోపలకు రావడంతో మార్షల్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

వారిని వెంటనే బలవంతంగా బయటకు తీసుకు వచ్చారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది భద్రతా వైఫల్యం కాదని, సభలోకి వచ్చిన ముగ్గురి వద్ద పాసులు ఉన్నాయని ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తెలియజేశారు. కాగా వారు జమ్మూకు చెందిన యువకులను తెలిస్తోంది.

మరోవైపు యువకులకు పాసులు అందటంపై స్పీకర్ దర్యాఫ్తునకు ఆదేశించారు. ఈ అంశాన్ని ఓమర్ అంత సీరియస్‌గా తీసుకోక పోవడం గమనార్హం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉన్నదని, వారు నిరాయుధులని, వెంటనే విడిచి పెట్టాలని సూచించారు.

English summary
Three youths caused a major security breach in Jammu Kashmir assembly on Monday, Oct 8 when one of them jumped into the well of the House. Two of the protesters screamed anti-government slogans and waved black flags demanding prompt government actions against unemployment in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X