బ్లాక్మనీతో ఆస్తులు: వాద్రాపై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు
రాబర్ట్ బ్యాలెన్స్ షీట్లో బ్యాంక్ డిపాజిట్లు వివరాలు ఏమీ లేవని చెప్పారు. డిఎల్ఎఫ్తో రాబర్ట్ కుమ్మక్కయ్యారని, వాద్రా కోసం హర్యానా ప్రభుత్వం కూడా డిఎల్ఎఫ్తో కుమ్మక్కైందన్నారు. డిఎల్ఎఫ్ వాద్రాకు రూ.60 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆసుపత్రికి ఇవ్వాల్సిన 350 ఎకరాల భూమిని హర్యానా ప్రభుత్వం డిఎల్ఎఫ్కు ఇచ్చిందని, ఇది కుమ్మక్కులో భాగంగానే జరిగిందన్నారు.
వాద్రా ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. కుమ్మక్కు విషయాన్ని హర్యానా కోర్టు కూడా ధృవీకరించిందని తెలిపారు. డిఎల్ఎఫ్ హోర్డింగ్స్లో వాద్రాకు యాభై శాతం వాటాలు ఉన్నాయన్నారు. వాద్రా ఆస్తులకు సంబంధించి తనకు చాలామంది వివరాలు పంపించారని తెలిపారు. హర్యానా ప్రభుత్వం డిఎల్ఎఫ్కు ఏజెంట్గా పని చేసిందని విమర్శించారు. డిఎల్ఎఫ్కు భూముల కేటాయింపులలో రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.
డిఎల్ఎఫ్ సెజ్లో వాద్రాకు యాభై శాతం వాటాలు అందాయని, వాటిని అతను సంవత్సరంలో తిరిగి విక్రయించారని ఆరోపించారు. డిఎల్ఎఫ్ ఎలాంటి హామీ లేకుండా రూ.60 కోట్ల రుణాన్ని వాద్రాకు ఇచ్చిందన్నారు. డిఎల్ఎఫ్కు కేటాయించిన భూములను హైకోర్టు రద్దు చేసిందని, భూ కేటాయింపులపై హర్యానా ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.