మహంకాళీ అమ్మవారి నగల చోరీ: పాతబస్తీలో ఉద్రిక్తత

అమ్మవారి నగలను చోరీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, చోరీపై అధికారులు సమాధానం చెప్పాలని భక్తులు డిమాండ్ చేశారు. మహంకాళీ అమ్మవారి భక్తులు భారీగా గుడి వద్దకు తరలి వచ్చారు. పాదయాత్రతో ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
నగర కమిషనర్ అనురాగ్ శర్మ అక్కడకు చేరుకున్నారు. ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు భక్తులను అడ్డుకున్నారు. దీంతో భక్తులు అక్కడ బైఠాయించారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి రావాలని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆలయ కమిటీ సభ్యులతో అనురాగ్ శర్మ చర్చలు జరుపుతున్నారు.
కాగా అమ్మవారి నగల చోరీ కేసులో పదకొండు మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితులు ఎవరో తేలుస్తామని చెప్పారు. భక్తులకు విశ్వహిందూ పరిషత్, బజరంగ దళ, ఆలయ కమిటీ సభ్యులు మద్దతు పలికారు. కాగా మంత్రి గీతారెడ్డి వచ్చి హామీ ఇవ్వడంతో భక్తులు తమ ఆందోళనను విరమించుకున్నారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications