హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఒక్కడే చేస్తాడు: సంకినేని, విజయమ్మతో జలగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sankineni Venkateswara Rao
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కేవలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అమలు చేయగలరని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మాజీ సీనియర్ నేత సంకినేని వెంకటేశ్వర రావు ఆదివారం అన్నారు. ఆయన ఉదయం పార్టీ కార్యాలయంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ పథకాల అమలు జగన్ వల్లే సాధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు కుమ్మక్కై జగన్‌ను జైలులో పెట్టించారని ఆరోపించారు. పార్టీలు మారిన వారికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని నిప్పులు చెరిగారు. బాబు అవకాశవాద రాజకీయాలు నచ్చకనే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యానని తెలిపారు.

తాను నవంబర్ 11న పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో సూర్యాపేటలో ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, సీనియర్ రాజకీయనేత జలగం వెంకట్రావు కూడా విజయమ్మను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తాను నవంబర్ 19వ తేదిన ఖమ్మంలో విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.

English summary
Former Tungaturthi MLA Sankineni Venkateswara Rao said on Sunday that he will join in YSR Congress party on November 11th. He said YS Jaganmohan Reddy will took late YSR regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X