నెహ్రూ విగ్రహానికి మద్యం సీసా: పక్కనే వైయస్ విగ్రహం
ఆదివారం ఉదయం పది గంటల వరకు దీనిని ఎవరూ చూడలేదు. ఆ తర్వాత స్థానికులు దీనిని గమనించి, పోలీసులకు సమాచారమందించారు. పరిస్థితి అదుపు తప్పకూడదన్న ఉద్దేశ్యంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. నెహ్రూ విగ్రహానికి ఉన్న మద్యం సీసాను తొలగించారు.
ఈ విగ్రహానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉంది. దీంతో తాగిన వారు ఎవరో మద్యం మైకంలో నెహ్రూ విగ్రహానికి దీనిని తగిలించి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరు ఇలా చేశారో తెలుసుకుంటామని వారు చెప్పారు. నెహ్రూ విగ్రహానికి మద్యం సీసాను తగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం పక్కనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది. దానికి ఏమీ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నెహ్రూ విగ్రహంపై ఇలా దుశ్చర్యకు దిగడంతో అందరూ దానిని ఖండిస్తున్నారు.