ముగ్గురు అమ్మాయిలు సహా గీతం స్టూడెంట్స్ గల్లంతు
వారు రాహుల్ బాబు అనే విద్యార్థిని రక్షించారు. మరో ఆరుగురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో భూపతి సుశీల్, ప్రీతి రెడ్డి, సింధూజ, సాయి నితిన్, అనురాగ్ రెడ్డితో పాటు మరొకరు ఉన్నట్లుగా తెలుస్తోంది. గల్లంతైన ఆరుగురిలో ముగ్గురు అమ్మాయిలు అని తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. సాయి ప్రియా రిసార్ట్ సమీపంలో వారు గల్లంతయ్యారు.
గల్లంతైన విద్యార్థులు అందరూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. అందరూ మొదటి సంవత్సరం విద్యార్థులే కావడం విషాదకరం. వీరి కోసం నావికాదళం రంగంలోకి దిగింది. మెరైన్ హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సింధు హైదరాబాద్, అనుష నల్గొండ, సాయి నితిన్ హైదరాబాద్, సుశీల్ వరంగల్, అనురాగ్ కరీంనగర్, ప్రీతి కరీంనగర్లకు చెందిన వారిగా గుర్తించారు.
గోడ కూలి ముగ్గురి మృతి
చెర్లపల్లి పారిశ్రామికవాడలో శ్రీసాయికృష్ణ ఇండస్ట్రీలో బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఓ గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ పరిశ్రమలో బ్లోయర్స్ తయారు చేస్తుంటారు. స్లాబ్ వేసేందుకు గోడ కడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన వారు ఉన్నారు.