వెళ్తూ వెళ్తూ రాబర్ట్ వాద్రాకు ఝలక్ ఇచ్చిన ఐఏఎస్
అయితే వెళ్తూ వెళ్తూ అధికారి ఖేమ్కా వాద్రాకు, డిఎల్ఎఫ్కు, వారిని వెనుకేసుకొస్తున్న శక్తులకు గట్టి ఝలక్ ఇచ్చి వెళ్లారు. డిఎల్ఎఫ్కు వాద్రా సంస్థ చేసిన భూ విక్రయాన్ని ఆయన రద్దు చేశారు. ఇది రూ.58 కోట్ల డీల్ అని తెలుస్తోంది. ఖేల్కా ఈ నెల 15వ తేదిన రద్దు చేశారు. రూ.58 కోట్ల విలువైన 3.5 ఎకరాల డీల్ను రద్దు చేశారు.
కాగా రాబర్ట్ వాద్రా, డిఎల్ఎఫ్ మధ్య జరిగిన ల్యాండ్ డీల్పై విచారణకు ఆదేశించినందుకు గాను హర్యానా ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి డిఎల్ఎఫ్కు 3.5 ఎకరాల భూమి బదలాయింపు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన భూముల రిజిస్ట్రేషన్ శాఖ అధికారి అశోక్ ఖేమ్కాని ప్రభుత్వం బదిలీ చేసినట్లు వార్తలు వచ్చాయి.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భూమి కుంభకోణాలపై ఖేమ్కా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని, తనకూ తన కుటుంబానికీ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఖేమ్కాను బదిలీ చేయడంపై హర్యానా ప్రభుత్వం మీద ఇండియా అగనెస్ట్ కరప్షన్ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తనపై 19 ఏళ్లలో 43 బదిలీ వేట్లు పడ్డాయని ఖేమ్కా చెప్పారు. తన బదిలీలకు కారణమేమిటో చెప్తే తాను మంచి సివిల్ సర్వెంట్గా మారడానికి తనను తాను మార్చుకుంటానని అన్నారు. తాను అక్టోబర్ 8వ తేదీన విచారణకు ఆదేశించానని, తనకు అక్టోబర్ 11వ తేదీన బదిలీ ఆదేశాలు వచ్చాయని ఖేమ్కా చెప్పారు.