వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ ఆలయంలో తొక్కిసలాట: ఇద్దరు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhya Pradesh
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో గల సల్కాన్‌పూర్ దేవి ఆలయంలో శనివారం తెల్లవారు జామున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మరణించగా, 13 మంది గాయపడ్డారు. భోపాల్‌కు 70 కిలోమీటర్ల దూరంలో గల ఓ కొండ ప్రాంతంపై ఉన్న ఆలయం నుంచి భక్తులు తిరిగి వస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది.

కొండపై నుంచి తిరిగి వస్తుండగా కాళ్లు జారి కిందపడిపోవడంతో ఇద్దరు మరణించారు. ఓ మహిళతో పాటు బాలిక కింద పడిపోవడం తొక్కిసలాటకు కారణమైందని అంటున్నారు. ఇది తొక్కిసలాట కాదని, ఓ 30 ఏళ్ల మహిళ, 14 ఏళ్ల బాలిక కిందికి దిగి వస్తుండగా కాళ్లు జారి పడిపోయారని, ఈ సంఘటనలో వారు మరణించారని పోలీసులు అంటున్నారు. అదే రకంగా మరో 13 మంది గాయపడ్డారని చెబుతున్నారు.

గాయపడినవారిని భోపాల్, సెహోర్ అస్పత్రులకు తరలించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చారు.

English summary
Two persons were killed and 13 others injured when a stampede broke out early today at Salkanpur Devi Temple in Sehore district of Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X