Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శాంతిభద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు: కిరణ్‌ రెడ్డి

Kiran Kumar Reddy
హైదరాబాద్: శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టు ఉన్న ఇళ్లు, అపార్టుమెంట్లను పరదాలతో కప్పి పుచ్చారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.

రైతులకు ఎంత చేసినా తక్కువే అని నమ్మే ప్రభుత్వం తమది అన్నారు. ఆయిల్ ఫాం రైతులకు వ్యాట్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. యాంత్రీకరణ ద్వారా రైతులకు 50 శాతం రాయితీ ఇస్తున్నామని, 32 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రైతులకు ఆదుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. దేశంలో కేవలం మన దేశంలోనే పది శాతం రైతులు పంట రుణాలను మన రాష్ట్రంలోనే పొందుతున్నారన్నారు.

మెరుగైన పాలన అందిస్తామన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్‌లను ఆదర్శంగా తీసుకొని పని చేస్తామన్నారు. ఆక్వా రంగానికి 468 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేసినట్లు చెప్పారు. సాగు రైతుకు ఏటా రూ.2వేల కోట్ల రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు.

వచ్చే రెండేళ్లలో పదహారువేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీపడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతికి శాంతిభద్రతల పరిరక్షణ చాలా ప్రధానమన్నారు. విద్యుత్ రంగంలో సమస్యలున్నా ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు.

ప్రస్తుతం రోజుకు 286 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా 225 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేస్తున్నామన్నారు. కొరతను అధిగమించడానికి అందుబాటులో ఉన్న మొత్తం విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామన్నారు. 2013 డిసెంబర్ నాటికి దక్షిణ గ్రిడ్ పూర్తి చేస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+