బాబు కాన్వాయ్లో వెహికిల్ బోల్తా: కృష్ణాలో విజయమ్మ

జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి సమీపంలో జాతీయ రహదారిపై చంద్రబాబు కాన్వాయ్లోని ఓ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుండి వాహనంలో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్కు గాయాలయ్యాయి. ఎదురుగా ఓ గేదె వస్తుండగా దానిని తప్పించబోవడంతో బాబు కాన్వాయ్లోని వాహనం బోల్తా పడింది.
ఆ తర్వాత చంద్రబాబు కృష్ణా జిల్లాకు చేరుకున్నారు. గన్నవరంలో మీడియాతో మాట్లాడారు. తాము ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డెడ్ స్టోరేజీ సమయంలో కూడా వ్యవసాయానికి నీటిని ఇచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన సరిగా లేదన్నారు. ఓ వైపు విద్యుత్ లేక మరోవైపు భారీ తుఫానుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నీటి కొరత, విద్యుత్ కొరతతో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారన్నారు. పంట నష్టం తర్వాత అధికారులు పర్యటిస్తున్నారని విమర్శించారు. కాగా అంతకుముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె సోమ, మంగళ.. రెండు రోజులు తుఫాను బాధిత ప్రాంతాలను పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications