వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకగ్రీవ ఎన్నిక: 'డింపుల్ ఇంటికి నోటీసులు అంటించండి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dimple Yadav
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, కన్నౌజ్ పార్లమెంటు సభ్యురాలు డింపుల్ యాదవ్‌కు నోటీసులు అందజేయాలని లేదంటే ఆమె ఇంటి బయట అంటించాలని అలహాబాద్ హైకోర్టు ఇటా జిల్లా జడ్జిని సోమవారం ఆదేశించింది. పార్లమెంటు సభ్యురాలిగా 35 ఏళ్ల డింపుల్ ఏకగ్రీవ ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు సంబంధించి ఆమె స్పందించక పోవడంపై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

నోటీసులు ఆమెకు నేరుగా ఇచ్చేందుకు అధికారులు భయపడిన పక్షంలో ఇంటికి అంటించాలని సూచించింది. గత జూన్ నెలలో జరిగిన కన్నౌజ్ పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలలో డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఓటర్ పార్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన ప్రభాత్ కుమార్ పాండే అనే వ్యక్తి సదరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తాను భావించానని, తాను నామినేషన్ వేయకుండా సమాజ్ వాది పార్టీకి చెందిన వారు కొందరు అడ్డగించారని ఆయన ఆరోపించారు.

తనను కిడ్నాప్ కూడా చేశారని అందువల్లే, తాను నామినేషన్ వేయలేక పోయానని, దీంతో డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు వివరణ కోరుతూ డింపుల్‌కు పలుమార్లు నోటీసులు పంపించింది. దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో విచారణ ఈ నెల 22వ తేదికి వాయిదా పడింది.

English summary
After allegations that officials are scared of serving a legal document to Dimple Yadav, the wife of Uttar Pradesh Chief Minister Akhilesh Yadav, the Allahabad high court on Monday asked the Etah District Judge to serve notice of the election petition on Dimple Yadav, or in her absence, paste it at her home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X