పాతబస్తీ ఉద్రిక్తం: ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేల అరెస్ట్

ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్, ముంజంఖాన్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు 144వ సెక్షన్ విధించడం, పరిస్థితి టెన్షన్గా మారడంతో పాతబస్తీలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను బొల్లారం పోలీసు స్టేషన్కు తరలించారు.
కాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదివారం వెల్లడించారు. నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలందరు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి పుకార్ల నమ్మవద్దని పజలుకు నగర ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలయం విషయంలో హైకోర్టు సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలను పాటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications