వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్టరీ: శిథిలాంగాలు బాలీవుడ్ నటి లైలా ఖాన్‌వే

By Pratap
|
Google Oneindia TeluguNews

Laila Khan
ముంబై: బాలీవుడ్ వర్ధమాన నటి లైలా ఖాన్ హత్య మిస్టరీ వీడినట్లే. ఇగత్పురిలోని లైలా ఖాన్ ఫామ్ హౌస్‌లో లభించిన శిథిల శరీరాంగాలపై డిఎన్ఎ పరీక్షలు నిర్వహించారు. ఆ శిథిలాంగాలా వర్ధమాన నటి లైలా ఖాన్‌, ఆమె కుటుంబ సభ్యులవేనని డిఎన్ఎ పరీక్షల్లో తేలింది. దీంతో లైలా ఖాన్ హత్య మిస్టరీ వీడిందని భావిస్తున్నారు.

లైలా ఖాన్ హత్య కేసులో క్రైం బ్రాంచ్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. త్వరలో కోర్టుకు నివేదికను సమర్పించనున్నారు. లైలా ఖాన్‌తో పాటు ఆమె ఐదుగురు కుటుంబ సభ్యులను హత్య చేసినట్లు ప్రధాన నిందితుడు పర్వేజ్ తక్ ఇప్పటికే అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

షకీర్ హుస్సేన్‌తో కలిసి వారిని మట్టుబెట్టినట్లు తక్ చెప్పాడు. షకీర్ హుస్సేన్ ఇంకా పరారీలో ఉన్నాడు. తక్ వెల్లడించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని పోలీసులు లైలా ఖాన్, ఆమె కుటుంబ సభ్యుల మృతదేహాల శిథిలాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించారు.

పోలీసులు రెండు కత్తులను, ఓ ఇనుప రాడ్‌ను, రెండు స్పేడ్స్‌ను, చిరిగిన దుస్తులను, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రపుటుంగరం సహాయంతో లైలా ఖాన్ మృతదేహాన్ని గుర్తు పట్టారు. ఆ ఉంగరాన్ని ఆమెకు బాయ్ ఫ్రెండ్ బహుమతిగా ఇచ్చాడు. వారిని తక్ 2011 ఫిబ్రవరిలో హత్య చేశాడు.

English summary
DNA tests have proved that the remains recovered from Laila Khan's Igatpuri farmhouse are that of the starlet and her family members, said a crime branch officer. The crime branch had filed a chargesheet in the case and will submit the report in the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X