మిస్టరీ: శిథిలాంగాలు బాలీవుడ్ నటి లైలా ఖాన్వే
లైలా ఖాన్ హత్య కేసులో క్రైం బ్రాంచ్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. త్వరలో కోర్టుకు నివేదికను సమర్పించనున్నారు. లైలా ఖాన్తో పాటు ఆమె ఐదుగురు కుటుంబ సభ్యులను హత్య చేసినట్లు ప్రధాన నిందితుడు పర్వేజ్ తక్ ఇప్పటికే అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
షకీర్ హుస్సేన్తో కలిసి వారిని మట్టుబెట్టినట్లు తక్ చెప్పాడు. షకీర్ హుస్సేన్ ఇంకా పరారీలో ఉన్నాడు. తక్ వెల్లడించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని పోలీసులు లైలా ఖాన్, ఆమె కుటుంబ సభ్యుల మృతదేహాల శిథిలాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించారు.
పోలీసులు రెండు కత్తులను, ఓ ఇనుప రాడ్ను, రెండు స్పేడ్స్ను, చిరిగిన దుస్తులను, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రపుటుంగరం సహాయంతో లైలా ఖాన్ మృతదేహాన్ని గుర్తు పట్టారు. ఆ ఉంగరాన్ని ఆమెకు బాయ్ ఫ్రెండ్ బహుమతిగా ఇచ్చాడు. వారిని తక్ 2011 ఫిబ్రవరిలో హత్య చేశాడు.