కెసిఆర్ ఆహ్వానం, ఒత్తిడి: టిఆర్ఎస్లోకి స్వామిగౌడ్

అయితే అప్పటికప్పుడు స్పందించని స్వామి గౌడ్ ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరడం లేదని, తెలంగాణ కోసమే పోరాటం చేస్తానని ప్రకటించారు. వివిధ సందర్భాల్లో ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు స్వామి గౌడ్ను చేర్చుకునేందుకు తెరాస,బిజెపిలు ప్రయత్నించాయి. అయితే తెరాసలో చేరేందుకే మొగ్గుచూపిన స్వామి గౌడ్.. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు.
పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి తెరాసలో చేరిన సందర్భంగా గురువారం నిర్వహించిన సభలోనూ స్వామి గౌడ్ పాల్గొన్నారు. హైదరాబాద్లో శుక్రవారం జరుగనున్న సమావేశానికి తెలంగాణ ఐకాస ముఖ్యులను అదే వేదికపై నుంచి కెసిఆర్ ఆహ్వానించారు. వారిలో ఐకాస కన్వీనర్గా ఉన్న స్వామి గౌడ్ కూడా ఉన్నారు. ఉద్యోగ జెఏసిలో కీలక పాత్ర పోషించిన స్వామి గౌడ్ను పార్టీలో చేర్చుకునేందుకు కెసిఆర్ ఆయనపై ఒత్తిడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ ఉద్యోగ జెఏసి ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులను ఐక్యం చేయడంలోను, వారిని ఉద్యమ దిశగా నడిపించడంలోను స్వామిగౌడ్ కీలక పాత్ర పోషించారు. ఒక దశలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన తెరాసలోచేరతారని, చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు కోరారని కూడా అప్పట్లో తీవ్ర ప్రచారం జరిగింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications