నాపై రాజకీయ కుట్ర, నన్ను మారిస్తే ఏం కాదు: బొత్స

ఆ లేఖను చూడలేదన్నారు. తనకు తెలిసి అవన్నీ ఊహాజనిత కథనాలే అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాగా పని చేస్తోందన్నారు. కొందరు కుట్రపూరితంగా పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ సమైక్యతను కాపాడగలిగేది కేవలం కాంగ్రెసు పార్టీ మాత్రమే అన్నారు.
కిషోర్ చంద్రదేవ్ లేఖ వెనుక కుట్ర దాగి ఉందన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తనను మాఫియా డాన్తో పోల్చిన పత్రికపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన కూతురు వివాహాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గాంధీ భవనంలో కెవిపి రామచంద్ర రావుతో బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.
కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్లకు వ్యతిరేకంగా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసి ఉంటారని తాను భావించడం లేదని మంత్రి కొండ్రు మురళీ మోహన్ అన్నారు. 2014 వరకు ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో తాము 174 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మరో రెండు వైద్య కళాశాలలు వచ్చాయని చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications