వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈడికి జగతి పెట్టుబడుల వివరాలిచ్చా: విజయ సాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ ఫ్రా స్ట్రక్చర్‌కు సంబంధించిన వివరాలను తాను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి)కి ఇచ్చానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఏ2 నిందితుడు విజయ సాయి రెడ్డి మంగళవారం చెప్పారు. ఆయన ఈ రోజు ఉదయం ఈడి ఎదుట హాజరయ్యారు. ఈడి విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను మళ్లీ ఈ నెల 30వ తేది ఈడి ఎదుట హాజరవుతానని చెప్పారు. ఈడి అధికారులు వివిధ ప్రశ్నలు వేశారని, తాను వాటికి సవివరంగా సమాధానాలు ఇచ్చానని చెప్పారు. తాను చెప్పిన దానిని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు రికార్డ్ చేశారని విజయ సాయి రెడ్డి చెప్పారు. జగతి పెట్టుబడుల వివరాలు తెలియజేశానన్నారు.

కాగా సిబిఐ సమర్పించిన రెండో విడత ఛార్జీసీటు ఆధారంగా విజయ సాయి రెడ్డిని ఈడి ప్రశ్నించింది. రెండవ చార్జీషీటులో ఉన్నటు వంటి ఆస్తుల వివరాలు, ఆదాయ వనరులు తదితర వాటిపై ఈడి ప్రశ్నించినట్లుగా సమాచారం. విజయ సాయి ఇచ్చిన ఆధారాల ప్రకారం త్వరలో ఈడి మళ్ళీ ఆస్తుల అటాచ్‌మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది వరకు మొదటి చార్జీషీటు ఆధారంగా విచారణ జరిపిన ఈడి 52 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసిన విషయం తెలిసిందే.

English summary

 Vijaya Sai Reddy, A-2 accused in YSR Congress party chief YS Jaganmohan Reddy DA case has appeared before ED on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X