ఆయనే లీక్ చేశారు: ఢిల్లీ నేతల వద్ద బొత్స ఆవేదన

గురువారం పార్లమెంటు సెంట్రల్ హాలులో బొత్స సత్యనారాయణ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని ఆయన కలిశారు. కొద్ది సేపు మంతనాలు జరిపారు. ఇదే సమయంలో కిశోర్ చంద్రదేవ్ ఆరోపణలపై తోటి నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నోట్ ఆయనే ప్రెస్కు లీక్ చేసినట్లు తనకు ఆధారాలు లభించాయని చెప్పినట్టు సమాచారం. అనవసరంగా కిశోర్ చంద్రదేవ్ తన జోలికి వచ్చారని బొత్స కాస్త ఆగ్రహించారు.
కిషోర్ మీద ఎదురుదాడి చేయగల సత్తా తనకు ఉందని, అయితే తాను ఇతరులను పురికొల్పబోనని, పిసిసి అధ్యక్షుడిగా ఉండి అలా చేయడం మంచిది కాదని ఊరుకున్నానని ఆయన చెప్పారు. కాగా, అధిష్ఠానానికి అన్నీ వివరించాలని ఆయన యోచిస్తున్నారు.
2జీ స్కాంపై విచారణకు నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీలో రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్కి చోటు లభించింది. ఈ మేరకు గురువారం ఆయనను ఏఐసీసీ నామినేట్ చేసింది. మురళీ మనోహర్ జోషి నేతృత్వంలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశాల సమయంలో ప్రతిపక్షాలపై ఉండవల్లి విరుచుకుపడేవారు. ఈ అనుభవమే తాజా కమిటీలో అవకాశం కల్పించింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications