అమ్మాయిలా మాట్లాడుతూ, నగ్నంగా ఫొటోలు తీస్తూ...
వివరాలు ఇలా ఉన్నాయి - నాలుగు నెల ల క్రితం విజయవాడ సింగ్నగర్లోని పీఅండ్టీ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. యువతీయువకులతో స్నేహం పెంచుకున్న ఆ యువకుడు వారిని సింగ్నగర్కు రప్పిస్తుంటాడు. అలా వచ్చిన యువతీ, యువకులను నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉండేలాచేసి, వారికి తెలియకుండా నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు.
తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలోని గంగానపల్లికి చెందిన కృష్ణపు బాలాజీతో అమ్మాయిలా మాట్లాడి నగరానికి రప్పించాడు. తన ఇంట్లోకి పిలిచి మరో అమ్మాయిని పంపించి వారి అర్ధనగ్న దృశ్యాలను చిత్రీకరించాడు. బాలాజీ వద్ద ఉన్న డబ్బు తీసుకున్నాడు. మూడు రోజులు బంధించాడు. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు ఇస్తావా, లేకుంటే ఈ చిత్రాలను నెట్లో పెట్టమంటావా అంటూ బెదిరింపులకు దిగాడు.
సురేష్ చెరనుంచి తప్పించుకున్న బాలాజీ బుధవారం సింగ్నగర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు కథ బయటపడింది. సింగ్నగర్ సీఐ నాగేశ్వరరావు రంగంలోకి దిగి పిఅండ్టీ కాలనీలోని స్థావరంపై దాడిచేసి పలు నీలి సీడీలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఉన్న సురేష్తోపాటు, అతనికి సహకరించిన వీరేంద్రను అరెస్టుచేశారు. రాఘవేంద్ర, రాజమండ్రికి చెందిన ఓ వివాహిత పరారీలో ఉన్నారు.