హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిలకు గాలి కౌంటర్, జగన్ దోపిడీపై పయ్యావుల

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu-Payyavula Keshav
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కార్పోరేట్ దోపిడీని తాము బయటపెడతామని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. కాంగ్రెసు పార్టీలో కలవబోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెప్పగలరా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండేళ్ల పాలన విఫలమైందని ఆయన విమర్శించారు. తాను మారబోనని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలే మార్చేస్తారని ఆయన అన్నారు. పదేళ్లనాటి తెలుగుదేశం పాలనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని షర్మిల ఫాక్షనిస్టుగా అభివర్ణించడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఖండించారు. షర్మిల తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డే పెద్ద ఫాక్షనిస్టు అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజల అండదండలతోనే షర్మిల పాదయాత్ర సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులంతా జైలులో ఉండాల్సినవారేనని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండేళ్ల పాలనను తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. తన రెండేళ్ల పాలనలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఓ వర్గాన్ని కూడా సంతృప్తి పరచలేదని ఆయన విమర్శించారు. క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలను ప్రవేశపెట్టిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డిదేనని ఆయన అన్నారు. రెండేళ్లలో కిరణ్ కుమార్ రెడ్డి సాధించిందేమి లేదని ఆయన అన్నారు.

రాష్ట్రం అప్పులు, రైతు ఆతహత్యలు పెరిగాయని ఆయన అన్నారు. ప్రభుత్వ పాలనలో గవర్నర్ జోక్యం పెరిగిందని ఆయన విమర్శించారు. అవినీతి మంత్రులను వెనకేసుకొచ్చేందుకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పరువు ప్రతిష్టలు దిగజారాయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆయన అన్నారు.

English summary
Countering YSR Congress president YS Jagan's sister Sharmila comments on Chandrababu Naidu, Telugudesam leader Gali Muddukrishnama Naidu accused that YS Rajasekhar Reddy was a factionist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X