వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆరే టిడిపి జెండా మోశారు: ముందే మందకృష్ణ వేడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
నల్గొండ: తెలంగాణ రాష్ట్ర సమితి సమరభేరికి ముందే ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నల్గొండ జిల్లా సూర్యాపేటలే వేడి రగిలించారు. రాష్ట్ర మంత్రి గీతా రెడ్డి పైన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమర్థించడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జూనియర్ కళాశాల నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో భారీగా ఎమ్మార్పీఎస్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడారు. గీతారెడ్డి పైన కోదండ వ్యాఖ్యలను కెసిఆర్ సమర్థించడం ఎంత వరకు సమంజసం అన్నారు. దళితులపై దాడులను కెసిఆర్ ఏనాడూ ఖండించలేదన్నారు. కోదండ క్షమాపణలు చెప్పినప్పటికీ కెసిఆర్ సమర్థనను నిరసిస్తూనే తాము నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు. దళిత సామాజిక వర్గాన్ని కించపరిస్తే కెసిఆర్ కుటుంబాన్ని నీడలా వెంటాడుతామన్నారు.

తాము తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. కోదండ వ్యాఖ్యలను సమర్థించినందుకు కెసిఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ కెసిఆర్ కుటుంబం జాగీరు కాదన్నారు. 85 శాతం బలహీన వర్గాల వారు ఉన్నారని వారిపై కెసిఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. తమమ ఆత్మగౌరవాన్ని పోగొట్టి తెలంగాణ ఉద్యమం నడపాలనుకుంటే ఖబర్దార్ కెసిఆర్ అంటూ హెచ్చరించారు.

తాము తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయడం కాదని, తమ వర్గీకరణకు మద్దతిచ్చే ప్రతి ఒక్కరికి తాము మద్దతిస్తామని చెప్పారు. టిడిపి జెండాను తాము ఎప్పుడూ మోయలేదని చెప్పారు. కానీ అదే కెసిఆర్ టిడిపి జెండాను 2009లో ఓట్లు సీట్ల కోసం మోశారన్నారు. కాగా భారీగా చేరుకున్న కార్యకర్తలు నల్లజెండాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు.

English summary

 MRPS president Manda Krishna Madiga said TRS chief K Chandrasekhar Rao was allie of Telugudesam Party in 2009.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X