సబ్ ప్లాన్పై చర్చ: దానం, మోత్కుపల్లి వివాదం

దళితులకు న్యాయం జరగాలంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని ఆయన అన్నారు. దళితులకు రాజ్యాంగపరమైన హక్కును కల్పించింది అంబేడ్కర్ అని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించే అవకాశం అంబేడ్కర్కు కాంగ్రెసు పార్టీ ఇచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. దానికి మోత్కుపల్లి ప్రతిస్పందిస్తూ - దళితుడని చెప్పి అంబేడ్కర్కు ఆ అవకాశం ఇవ్వలేదని, ప్రపంచ మేధావుల్లో ఒక్కరు కాబట్టి అంబేడ్కర్కు ఆ అవకాశం వచ్చిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీల మనోవేదనను అర్థం చేసుకుని ఉంటే దళితులకు ఈ అవకాశం వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ దళిత వ్యతిరేకి కాబట్టే దేశంలో ప్రాంతీయ పార్టీలు వచ్చాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలకు అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని - పరస్పర దూషణలకు వెళ్లి బిల్లు ప్రాముఖ్యాన్ని తగ్గించవద్దని, ఇదో చారిత్రాత్మకమైన బిల్లు అని, రాజకీయాలకు అతీతంగా చర్చ జరగాలని అన్నారు. దానికి మోత్కుపల్లి తీవ్రంగా మండిపడ్డారు. దళిత మంత్రి గీతారెడ్డిపై ఓ నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు ఖండించలేదని అడిగారు.
దళితులకు కేటాయించిన నిధులను జలయజ్ఞం పేరుతో దండుకున్నారని ఆయన ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి దళితుల భూములను పెత్తందార్లకు కట్టబెట్టారని ఆయన అన్నారు. అసైన్డ్ భూములను క్రమబద్దీకరించి దళితులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కమిటీ చైర్మన్గా ఉండడం తన అదృష్టమని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నిధుల వినియోగానికి ఓ యంత్రాంగం లేకపోతే అమలు కష్టమని ఆయన అన్నారు. సబ్ ప్లాన్ తయారీకీ 30 సమావేశాలు ఏర్పాటు చేశామని అన్నారు నివేదికను నాలుగు గోడల మధ్య రూపొందించలేదని, సమావేశాలు పెట్టి చర్చలు జరిపామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications