గుడివాడ ఎవడి సొత్తు కాదు: బాలకృష్ణ, జంప్ల పైనా
కొందరు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు. తాను ఎక్కడి నుండి పోటీ చేసేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో తెలుగుదేశం పార్టీదే విజయం అన్నారు. కొందరు అవకాశవాదం కోసం, స్వార్ధం కోసమే పార్టీని వీడుతున్నారన్నారు. కొందరు నేతలు వెళ్లిపోయినంత మాత్రాన నష్టం లేదని, పార్టీకి అంకిత భావంతో పని చేస్తే కార్యకర్తలు ఉన్నారని అన్నారు.
సినిమాల్లో తెలుగు భాషకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందన్నారు. తెలుగు సినిమాల్లో ఇటీవలి కాలంలో తెలుగుకు ప్రాధాన్యత తగ్గుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన సినిమాల్లో మాత్రం తెలుగుకు ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. తెలుగు భాష కోసం తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నానని చెప్పారు.
గన్నవరం చేరుకున్న బాలకృష్ణ హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుండి గుడివాడక వెళ్లారు. స్థానిక పార్టీ నేత ఇంట్లో ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యేందుకు వచ్చారు. కాగా బాలకృష్ణకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు గన్నవరం విమానాశ్రయానికి తరలి వచ్చారు.