వెయ్యి కిమీ పూర్తైన బాబు పాదయాత్ర: మోకాళ్ల యాత్ర
నిజామాబాద్ జిల్లాలో ఆరో రోజు ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. జిల్లాలోని పెంటకుదురు వద్ద బాబు యాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరింది. బాబు యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సమయంలో పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. అంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో బాబు యాత్ర చేశారు. ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నారు. ఇప్పటి వరకు 26 నియోజకవర్గాల్లో ఆయన తిరిగారు.
కాగా చంద్రబాబు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్బంగా విశాఖపట్నం జగదాంబ కూడలి వద్ద విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ మోకాళ్ల యాత్ర చేశారు. ఈ యాత్రకు నియోజకవర్గం కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
Comments
chandrababu naidu vastunna meekosam nizamabad vishakapatnam చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం నిజామాబాద్ విశాఖపట్నం
English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has completed thousand kilometers padayatra on Monday.
Story first published: Monday, December 3, 2012, 13:59 [IST]