చంద్రబాబుకు చిక్కులు: వారిని వెళ్లగొట్టాలని కొత్తకోట

రాజ్యసభలో ఎఫ్డీఐలపై జరిగిన ఓటింగ్కు గైర్హాజరైన ముగ్గురు ఎంపిలు దేవేందర్గౌడ్, సుజన చౌదరి, గుండాసుధారాణి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాడ్ చేశారు. ఇలాంటి నేతల వల్ల పార్టీకి నష్టమని, చంద్రబాబునూ, పార్టీనీ ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి వచ్చిందని ఆయన శనివారం అన్నారు.
చీము, నెత్తురు ఉంటే ఆ ముగ్గురు ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. తెలుగు దేశం కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి వ్యక్తులు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చెప్పి ఓటింగ్ గైర్హాజరైతే అది ఆత్మహత్యసదృశ్యమేనని ఆయన అన్నారు. ఓటింగ్కు హాజరుకాకపోవడానికి ఆరోగ్యం బాగోలేదనడం సరికాదని కొత్తకోట దయాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు.
రాజ్యసభకు ముగ్గురు ఎంపీలు గైర్హాజరు కావడం క్షమార్షం కాదని ఆయన అన్నారు. అది పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. కాగా, తనకు కాంగ్రెసు పార్టీతో లాలూచీ పడాల్సిన అవసరం లేదని గుండు సుధారాణి అన్నారు. తన సంజాయిషీకి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆమె అన్నారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications