వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపికి మాతృవియోగం: ఢిల్లీ నుండి బయల్దేరిన కెవిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao
విజయవాడ/న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు మాతృమూర్తి కన్నుమూశారు. కెవిపి తల్లి సీతాదేవి మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మృతి చెందారు. తల్లి మృతి విషయం తెలిసిన వెంటనే న్యూఢిల్లీలో ఉన్న కెవిపి రామచంద్ర రావు హుటాహుటిన విజయవాడకు బయలుదేరారు. సీతాదేవి అంత్యక్రియలు బుధవారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంబాపురం గ్రామంలో జరగనున్నాయి. సీతాదేవి నాలుగు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. స్వగ్రామం అంబాపురంలోనే ఆమె కన్నుమూశారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కెవిపి రామచంద్ర రావు చక్రం తిప్పిన విషయం తెలిసిందే. కెవిపిని వైయస్ తన ఆత్మబంధువుగా చెప్పుకునే వారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన తర్వాత ఆయన కృష్ణా జిల్లా ఓదార్పులో ఉన్నప్పుడు తన యాత్ర రూటును అకస్మాత్తుగా మార్చుకొన్న విషయం తెలిసిందే.

జగన్ తన దారిని మార్చుకొని అంబాపురం మీదుగా వెళ్లారు. అంబాపురంలో కెవిపి రామచంద్ర రావు ఇంటికి వెళ్లి ఆయన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కెవిపి ఇంటికి జగన్ హఠాత్తుగా వెళ్లడం, సీతాదేవి ఆశీర్వాదాలు తీసుకోవడం చర్చనీయాంశమయ్యాయి. సీతాదేవితో కాసేపు జగన్ ముచ్చటించారు.

English summary
Congress party senior leader KVP Ramachandra Rao's mother Seetha Devi was died on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X