మోడీపై ప్రశంసలు: ఐశ్వార్యపై జయా బచ్చన్ అసంతృప్తి
ఐశ్వర్యా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరును నేరుగా ప్రస్తావించక పోయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధిపై ఆమె చేసిన ప్రశంసలు మోడీకే చెందుతాయి. ఆదివారం ఆమె వడొదరలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె గుజరాత్ అభివృద్ధిపై మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
గుజరాత్ విజయగాథ తనను ఎంతో ముగ్ధురాలిని చేసిందని, నిజంగా అత్యంత అభినందనీయమైన విషయమని అన్నారు. గుజరాత్ సాధించిన విజయాల గురించి తనకు తెలుసునని, తనకు ఇక్కడ ఉంటే సొంత ఇంట్లో ఉన్నట్లుగా ఉంటుందన్నారు. నానాటికి గుజరాత్ బలోపేతమవుతోందని... ఈ విజయాన్ని తాను మనసారా అభినందిస్తున్నానని చెప్పారు. గుజరాత్ విజయగాథకు తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు.
ఐశ్వర్ రాయ్ మామ అమితాబ్ బచ్చన్ గుజరాత్ సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం తెలిసిందే. అమితాబ్ వల్ల గుజరాత్ పర్యాటక రంగంలో అనూహ్యమైన మెరుగుదల కనిపించిందని, సందర్శకుల సంఖ్య పెరిగిందని నరేంద్ర మోడీ ప్రభుత్వం కొంతకాలంగా చెప్పుకుంటోంది.