ప్రధానికి విజయమ్మ లేఖ: జైల్లో జగన్ కలిసిన కాసాని

YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయాభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారని ఆమె తన లేఖలో రాశారు. ఆయన హయాంలో వ్యవసాయాభివృద్ధి రేటు 6.87గా నమోదయిందని చెప్పారు. ప్రస్తుతం మాత్రం రైతులకు వ్యవసాయం పెను భారంగా మారిందని అన్నారు.

ఎరువుల ధరను వెంటనే తగ్గించాలని లేఖలో ప్రధానికి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. దేశ ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని, గడిచిన రెండేళ్లలో వరి కనీస మద్దతు ధర 25 శాతం పెరిగితే.. ఎరువుల ధరలు మాత్రం దాదాపు మూడు వందల శాతం వరకు పెరిగాయని విజయమ్మ పేర్కొన్నారు.

జగన్‌ను కలిసిన కాసాని

జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ శాసనమండలి సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జిహెచ్ఎంసి కాంగ్రెసు ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్ శుక్రవారం కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న వైయస్ జగన్ వెంట తాము ఉంటామని వారు ఈ సందర్భంగా చెప్పారు.

తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతానని కాసాని జ్ఞానేశ్వర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో ఆ తేది ప్రకటిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనను మర్చిపోలేక పోతున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+