హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాగుడుమూతలొద్దు: జగన్ టిడిపికి హరీష్, సీరియల్‌లా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం నకిలీ పక్షమని మరోసారి తేలిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు శుక్రవారం అన్నారు. గంభీర ఉద్యమానికి న్యాయమైన పరిష్కారాన్ని కేంద్రం ఇవ్వలేక పోయిందన్నారు. తెలంగాణపై తేల్చకుండా మరో వాయిదా పెట్టడమేమిటని ప్రశ్నించారు.

కాంగ్రెసు పార్టీ తెలంగాణ తెలంగాణ అంశం విషయంలో మొదటి నుండి దాటవేత ధోరణిని అవలంభిస్తోందన్నారు. ముగింపు లేని టీవి సీరియల్‌లా దీనిని కొనసాగిస్తోందన్నారు. వందలాది మంది విద్యార్థులు తెలంగాణ కోసం చనిపోతుంటే ఇంకా నాన్చడం సరికాదన్నారు. హోంమంత్రి ఖచ్చితమైన రోడ్డు మ్యాప్‌తో వస్తారని తాము భావించామని కాని అలా జరగలేదన్నారు. అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెసు ప్రతినిధులు కలిసి కూడా రాలేదన్నారు.

అలాగే వారు వేరువేరు అభిప్రాయాలు చెప్పారన్నారు. గాదె వెంకట రెడ్డి సమైక్యవాదం వినిపిస్తే... సురేష్ రెడ్డి తెలంగాణవాదం వినిపించారని విమర్శించారు. కాంగ్రెసు పార్టీ మోసపూరిత వైఖరిని అందరు గమనిస్తున్నారన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ రేపు ఇచ్చిన బందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలమా లేదా చెప్పకుండా అస్పష్ట విధానంతో ఉన్నదన్నారు.

ఇవ్వాలా వద్దా చెప్పకుండా సెంటిమెంటును గౌరవిస్తున్నామని, పరిష్కరించాలని డిమాండ్ చేయడమేమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కూడా గొప్పగా ఏం చెప్పలేదన్నారు. పాత లేఖ పేరుతో దగా చేసిందన్నారు. సీల్డ్ కవర్‌లో ఇవ్వాల్సిన అవసరమేమిటన్నారు. 2009లో తెలంగాణను అడ్డుకుంది టిడిపియే అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు దాటిందని, కాంగ్రెసు తీరు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందన్నారు.

English summary
Siddipet TRS MLA Harish Rao has lashed out at Congress, YSR Congress and Telugudesam Party on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X