తేల్చండి: మంత్రులు, తెలంగాణపై అంతా తెల్సు: ప్రణబ్
రాష్ట్రపతికి వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గురించి మీకు అంతా తెలుసునని, రాష్ట్రం ఏర్పాటు కోసం మీ అధికారాలు ఉపయోగించి చొరవ తీసుకోవాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరమైనా మా కోరిక నెరవేర్చాలని ఆయనను కోరారు. తెలంగాణ ఎప్పుడు వస్తుందో అప్పుడే తమకు తమకు న్యూ ఇయర్ అని వారు రాష్ట్రపతితో చెప్పారని సమాచారం. తెలంగాణపై మీకు పూర్తిగా అవగాహన ఉందని ప్రణబ్తో వారు చెప్పారు.
రాష్ట్రపతిని కలిసిన అనంతరం మంత్రులు మాట్లాడారు. అన్ని పార్టీలు ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో తమ అభిప్రాయాలు చెప్పాయన్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సిందే కేంద్రమే అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఇరు ప్రాంతాల్లోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని వారు అన్నారు. తాము చెప్పింది ప్రణబ్ ముఖర్జీ సావదానంగా విన్నారని, సానుకూలంగా స్పందించారన్నారు.
తనకు తెలంగాణ సమస్య గురించి పూర్తిగా తెలుసునని ప్రణబ్ ముఖర్జీ తమతో చెప్పారన్నారు. తెలంగాణపై త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనను ప్రస్తావిస్తూ... మహిళలకు భద్రత కల్పించాలని మంత్రులకు సూచించారు.