వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లెక్సీ చించివేత: జగన్ పార్టీ X కాంగ్రెస్, మారిన సీన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress-YSR Congress
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో అధికార కాంగ్రెసు పార్టీ ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ప్రారంభమైన గొడవ ఆ తర్వాత సామాజిక వర్గాల గొడవగా మారింది. కాంగ్రెసు పార్టీ నేతలు గ్రామంలో నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని కొందరు గుర్తు తెలియని దుండగులు చించి వేశారు. కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే ఫ్లెక్సీని చించి వేసిందని కాంగ్రెసు కార్యకర్తలు ఆరోపించారు.

ఇది ఇరువర్గాల మధ్య వాదనకు దారి తీసింది. వాదన కాస్త ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు కర్రలు పట్టుకొని బాహాబాహీకి దిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇరు వర్గాలు కర్రలతో రోడ్ల పైకి వచ్చాయి. దాదాపు నాలుగు వందల మంది బాహాబాహీకి దిగాయి. అయితే ఈ ఘర్షణ కాస్తా పార్టీల నుండి ఆ తర్వాత రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా మారింది.

సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా మారడంతో ఇరు పార్టీలు జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తున్నాయి. అధికారులతో దీనికి పుల్ స్టాప్ పెట్టించాలని చూస్తున్నాయి. కాగా గ్రామంలోని పరిస్థితి తెలియడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. గాయపడ్డ వారిని ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

English summary
Clash took between Congress and YSR Congress in East Godavari district on Tuesday. Eight injured in this clash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X