బట్టలిప్పేస్తానని పూనం, నగ్నఫోటోలతో షెర్లిన్: అనురాగ్
భారతీయ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో కీలు బొమ్మలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా అసభ్యంగా మారిపోయిందని ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇండియాకు భారత్కు మధ్య తేడా ఏమిటంటే.. ఇండియాలో డర్టీ పిక్చర్ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంటుందని ఎద్దేవా చేశారు. మహేశ్భట్ తన కూతురుతో శృంగారం గురించి మాట్లాడతాడని, ప్లేబోయ్ పత్రిక కవర్ పేజీ కోసం షెర్లిన్ చోప్రా తన నగ్న ఫొటోలను అందిస్తుందని మండిపడ్డాడు.
విదేశీ నీలి చిత్రాల తార పుట్టిన రోజును మీడియా జరుపుకుంటోందని, ఇండియాలో పూనం పాండేలాంటి వారు బట్టలు విప్పేస్తామని బహిరంగంగానే మాట్లాడతారన్నారు. అనురాగ్ ఠాకూర్ ఇలా తనదైన శైలిలో ఇండియాకు - భారత్కు తేడాను ఫేస్ బుక్లో వివరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశిస్తూ.. ఇండియాలో ప్రముఖ నేతలు మంత్రగత్తె చేతిలో తోలు బొమ్మలన్నారు.
కాగా, అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు ఆయన వెనుకబాటు మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సందీప్ దీక్షిత్ విమర్శించారు. కొందరు ఈ దేశాన్ని భారత్ - ఇండియా, మహారాష్ట్ర - బీహార్ అంటూ విభజిస్తున్నారని, ఇది మన జాతికి, ప్రజాస్వామ్యానికి హానికరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ వ్యాఖ్యానించారు. జాతిని చీల్చే వ్యాఖ్యలు చేస్తున్న పార్టీలపై అనర్హత వేటు వేయాలని బిజెపి నేత గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు.