అనుమతి వద్దు: విగ్రహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చే ముందు ప్రభుత్వాన్ని ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయవాది పిటిషన్ పైన విచారించిన కోర్టు ఈ రోజు విగ్రహాల ఏర్పాట్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం బెంచ్ న్యాయమూర్తులు ఆర్ఎస్ లోధా, ఎస్జె ముఖోపాధ్యాయ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేశారు.
కన్యాకుమారి జాతీయ రహదారిలోని ఓ ట్రాఫిక్ కూడలిలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఓ నేత విగ్రహాన్ని ఏర్పాటు చేసిందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు.
కేరళ ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లో, ప్రధాన రహదారులలో విగ్రహాల ఏర్పాటుకు, ఇతర కట్టడాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని బెంచ్ ఆదేశించింది. ఇతర కట్టడాలకు అంటే ట్రాఫిక్ కోసం ఉపయోగపడే వీధి దీపాలు తదితర వాటికి తమ ఆదేశాలు వర్తించవని పేర్కొంది. తమ ఈ ఆదేశాలు కేరళ ప్రభుత్వానికే కాకుండా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుందన్నారు.