జైలుకు వెళ్లి జగన్కు దండం పెట్టాలి: చంద్రబాబు
అవినీతిపై పోరాటం చేయడం ద్వారానే మహానేత ఎన్టీఆర్కు నిజమైన నివాళి అర్పించగలమని అన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కోదాడ మండలంలో ఏర్పాటుచేసిన విగ్రహాలను ఆవిష్కరిస్తూ శుక్రవారం చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, హరిజనవాడ, మార్కెట్ ఆఫీస్, బాలాజీనగర్ ప్రాంతాల మీదుగా 15 కిలోమీటర్లు నడిచారు.
చెప్పులు కుట్టే పల్లె వెంకటేశ్వర్లు చంద్రబాబుకు ప్రత్యేకంగా తయారుచేసిన చెప్పులను బహూకరించారు. జాతీయంగానూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఏకపక్ష పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, చూడలేక తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని ఆయన అన్నారు.
సంతకాలు పెట్టగానే జగన్ అవినీతి నీతిగా మారుతుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన శాఖ అధిపతులు, పెట్టుబడి పెట్టిన వ్యాపారులు జైలుకు వెళ్లారని, అప్పుడు దోపిడీ చేసిన మంత్రులు ఇప్పుడు దొరల్లా తిరుగుతున్నారని వైఎస్ పాలననుద్దేశించి చంద్రబాబు విరుచుకుపడ్డారు.