వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుది దాకా ఆగండి: జగన్‌కు మళ్లీ భంగపాటు, జైల్లోనే

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి భంగపాటు తప్పలేదు. జగన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలు, కేసు విచారణలో ఉన్న కారణంగా జగన్‌కు బెయిల్ ఇవ్వలేమని కోర్టు ఈ రోజు తేల్చి చెప్పింది.

ఆస్తుల కేసు దర్యాఫ్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) తుది ఛార్జీషీటు దాఖలు చేసిన తర్వాతే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. తుది ఛార్జీషీటు వరకు పిటిషన్ దాఖలు చేయవద్దని సుప్రీం కోర్టు సూచించిందని, కేసు విచారణ కొనసాగుతోందని, ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పిన సిబిఐ వాదనలతో హైకోర్టు ఏకీభవించి.. జగన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాఫ్తు కష్టంగా మారిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మంగళవారం వాదించిన విషయం తెలిసిందే. సిబిఐ తరఫు న్యాయవాది.. జగన్ ఆస్తుల కేసు దర్యాఫ్తుకు ఇంకా సమయం పడుతుందని కోర్టుకు చెప్పారు. అందుకు కోర్టు ఇంకా ఎంత సమయం పడుతుందని ప్రశ్నించింది. ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సహకారం అందడం లేదని, దీంతో దర్యాఫ్తు కష్టంగా మారిందని నెలకు పదిహేను వినతులను పంపిస్తున్నామని అయినా సమాధానం రావడం లేదని కోర్టుకు సిబిఐ తెలిపింది. దీంతో కేసు విచారణకు ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పడం కష్టంగా మారిందన్నారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణార్హం కాదని సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొందని చెప్పారు.

అంతకుముందు జగన్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. నిరంజన్ వాదనలు వినిపిస్తున్న సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకొని బెయిల్ పిటిషన్ పైన మీ వాదనలతో తమను సంతృప్తి పర్చగలరా అని ప్రశ్నించారు. అందుకు నిరంజన్ రెడ్డి కోర్టుకు సంతృప్తి కలిగేలా వాదనలు వినిపిస్తానని చెప్పారు. అందుకోసం జగన్ తరఫు న్యాయవాదికి హైకోర్టు అరగంట పాటు అనుమతి ఇచ్చింది. అరగంట తర్వాత తిరిగి వాదనలు ప్రారంభం కానున్నాయి.

వాదనల సమయంలో జగన్ న్యాయవాది ఇతర అంశాలపై మాట్లాడారు. దీంతో న్యాయమూర్తి... జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను సూచించిందని గుర్తు చేశారు. దాని ప్రకారమే వాదించాలని సూచించారు. అలా అయితే వాదనలు వినిపించండని లేదంటే సిబిఐ కోర్టులో తుది ఛార్జీషీట్ దాఖలు చేసే వరకు ఆగాలని సూచించారు. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు జగన్ అర్హతపై న్యాయమూర్తి స్పందించారు.

అర్హుడే కానీ సుప్రీం ఆదేశాలతో వాదనలు వినిపించాలని సూచించింది. వాదనలతో సంతృప్తిపర్చగలరా అంటే సరేనని జగన్ తరఫు లాయరు చెప్పారు. విచారణ అరగంట వాయిదా పడింది. సిబిఐ తరఫున అశోక్ బాన్ వాదనలు వినిపిస్తున్నారు. కాగా గతంలో సుప్రీం కోర్టు జగన్ రెగ్యులప్ పిటిషన్ పైన తీర్పు ఇస్తూ... సిబిఐ తుది ఛార్జీషీట్ దాఖలు చేసే వరకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది.

కాగా జగన్‌కు బెయిల్ రాకపోవటంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిరుత్సాహంలో మునిగిపోయింది.

English summary
Andhra Pradesh High Court on Thursday dismissed the bail petition of YSR Congress Party chief YS Jaganmohan Reddy in connection with the case alleged disproportionate assets involving him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X